Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళపల్లిలో నిలిచిన మిషన్ భగీరథ నీరు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:36 AM హన్మకొండ General
మంగళపల్లిలో నిలిచిన మిషన్ భగీరథ నీరు - Udayam
భీమదేవరపల్లి మండలం మంగళపల్లిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ ఏర్పడి మూడు రోజులు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ కారణంగా నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని గ్రామస్థులు తెలిపారు. అధికారులు వెంటనే లీకేజీని మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...