వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మంగినపూడి సముద్రతీరంలో సాగరతీర మహాగణపతి ఉత్సవ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. భక్తులకు తాగునీరు, ఆహారం, ఇతర సౌకర్యాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రహదారికి ఇరువైపులా మొక్కలు, స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించారు. మచిలీపట్నాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

