వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 24 గంటల్లో 25 ప్రసవాలు చేసి రికార్డు నెలకొల్పారు. గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తిశ్రీ ఆధ్వర్యంలో 11 సాధారణ, 14 శస్త్రచికిత్స ప్రసవాలు జరిగాయి.
బాలింతలు, శిశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆమె తెలిపారు. సిబ్బందిని సూపరింటెండెంట్ అశోక్కుమార్, ఆర్ఎంవో శ్రీధర్ అభినందించారు.
Comments
Loading comments...

