Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచాలలో అర్ధరాత్రి వరకు గణేశ్ పూజలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:22 AM రంగారెడ్డి General
మంచాలలో అర్ధరాత్రి వరకు గణేశ్ పూజలు - Udayam
మంచాల, ఆరుట్ల తదితర గ్రామాల్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. సోమవారం అర్ధరాత్రి వరకు గణనాథుల విగ్రహాల ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు కావడంతో పలు చోట్ల పూజారుల కోసం భక్తులు వేచిచూడాల్సి వచ్చింది. పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గణేశుని నామస్మరణతో గ్రామాలు మార్మోగగా, ఉత్సవ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...