వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ అర్శనపెల్లి రాజనర్సు (66) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. సుమారు 26 ఏళ్ళ సుదీర్ఘ కాలం పాటు ఆర్టీసీలో ప్రజలకు ఉత్తమ సేవలందించిన రాజనర్సు తన విధి నిర్వహణలో సౌమ్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం వెలిబుచ్చారు.
Comments
Loading comments...

