వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండలంలో ఆటో డ్రైవర్ల బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా మల్యాల క్రాస్ రోడ్డులోని ఆటో స్టాండ్ వద్ద ఆటోలను నిలిపివేసి డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, తమ సంక్షేమం కోసం 'డ్రైవర్ల సంక్షేమ బోర్డు' ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. కాగా, ఆటోల బంద్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

