వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ పట్టణం 35వ వార్డులో లబ్ధిదారుడు ప్రసాద్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.
లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రెండో విడతలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బాబర్, నరసింహులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

