Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లో 24 గంటల కరెంటు కోసం ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 2:40 PM నారాయణపేటGeneral
మక్తల్‌లో 24 గంటల కరెంటు కోసం ధర్నా - Udayam
వ్యవసాయానికి ప్రభుత్వం ప్రకటించిన 24 గంటల ఉచిత విద్యుత్‌ను సక్రమంగా అందించాలని డిమాండ్ చేస్తూ మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ రైతులు, యువకులు, గ్రామ పెద్దలు గురువారం నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. సరిపడా విద్యుత్ సరఫరా లేక పంటలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...