వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ జిల్లాలోని మేడారం జంపన్న వాగులో స్నానానికి వెళ్లిన తిమ్మయ్య (40) ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఆయన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన కారు డ్రైవర్గా గుర్తించారు.
భక్తులను మేడారానికి తీసుకొచ్చిన తిమ్మయ్య స్నేహితులను కలిసి అనంతరం వాగులో స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మిత్రులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Loading comments...
