వార్తలకు తిరిగి వెళ్లండి
వరి సాగుపై మంత్రి తుమ్మల హెచ్చరిక

రాబోయే నెలల్లో ఎల్నినో పరిస్థితులు తీవ్రమయ్యే సూచనలున్నందున, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగు నిర్ణయానికి రావొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
రాష్ట్రంలో వర్షపాతం లోటు ఉందని, ఎగువ నుంచి వరదలు వచ్చే అవకాశం లేదని తెలిపారు. శివారు జిల్లాల రైతులు కూరగాయల సాగు చేపట్టాలని కోరుతూ, దీనిపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...