వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండలో రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుల కోసం భూసేకరణపై మంత్రి నారాయణ రైతులతో గ్రామసభ నిర్వహించారు. భూసమీకరణ ద్వారా భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు ఆమోదం తెలుపుతూ పత్రాలు అందించారు.
రైతులకు నష్టం జరగకుండా ప్లాట్లు వెంటనే కేటాయించాలని, సమస్యలు పరిష్కరించాలని సభలో కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, అధికారులు, తాడికొండ పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

