వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులో మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకల్లో భాగంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని పలు మస్జిద్లలో ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. జామియా మస్జిద్లో మతగురువు రిజ్వీ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వ విలువలను వివరించారు.
ప్రవక్త ఆదర్శాలను నిత్యజీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు.
Comments
Loading comments...

