వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా బిచ్కుంద పోలీస్ స్టేషన్లో సోమవారం ఎస్ఐ రాజు మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం మైనార్టీ నాయకులతో సమావేశమయ్యారు.పండగను మత సామరస్యానికి ప్రతీకగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అందరూ సహకరించాలని కోరారు. దీనికి మైనార్టీ నాయకులు సానుకూలంగా స్పందిస్తూ మిలాద్ ఉన్ నబీ వేడుకలను శాంతియుతంగా నిర్వహించేలా సహకరిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

