వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ బస్టాండ్లోని టీజీఎస్ఆర్టీసీ కార్గో, పార్సెల్ విభాగంలో యజమానులు తీసుకెళ్లని పార్సిళ్లకు ఈ నెల 12న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. డిపో ఆవరణలో వేలం జరుగుతుందని డిపో మేనేజర్ అశోక్ తెలిపారు.
వైద్య, వాహన విడిభాగాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వేలంలో ఉంటాయి. ఆసక్తి ఉన్న వ్యాపారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. వివరాలకు 91542 98612ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

