వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని చింతగూడలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరుగుతున్నాయి.
వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని శుక్రవారం దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి మహిళలు భక్తులు భారీగా తరలివచ్చారు. దేవాలయంలోని అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మహిళలతో కుంకుమార్చన వరలక్ష్మీ వ్రతాలు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుతారి సుమలత పాల్గొన్నారు.
Comments
Loading comments...

