Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో తొలిదశ స్వాధీనం మరింత ఆలస్యం

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 9:45 AM హైదరాబాద్General
మెట్రో తొలిదశ స్వాధీనం మరింత ఆలస్యం - Udayam
హైదరాబాద్‌ మెట్రోరైలు తొలిదశ స్వాధీన ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. రూ.13,600 కోట్ల రుణ సేకరణ పూర్తికాకపోవడంతో షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ) పూర్తికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. 4 శాతం లోపు వడ్డీకి రుణం లభిస్తే అక్టోబరులోనే ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...