వార్తలకు తిరిగి వెళ్లండి

భామిని మండలం ఘనసర పంచాయతీ మెరక వీధిలో తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో వసంతకుమార్ ఆధ్వర్యంలో వీధుల్లో పర్యటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంటి ముందు మొక్క నాటాలని సూచించారు.
మెరక వీధిలోని కాలువ సమస్యను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్య క్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

