వార్తలకు తిరిగి వెళ్లండి
మేఘన సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కోడలు మేఘన తీవ్ర ఆరోపణలు చేశారు. పెళ్లి తర్వాత భర్తతో పాటు అత్తమామలు శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదనపు కట్నం, కారు, ఆస్తుల బదిలీ కోసం ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. పలుమార్లు తనను చంపేందుకు ప్రయత్నించి, విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని ఫిర్యాదులో వెల్లడించారు.
Comments
Loading comments...