వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట్ మండలంలో సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఉదయం 10.30 గంటలకు రైతువేదికలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సంగ్రామ్ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, మండల ప్రత్యేక అధికారి, 18 శాఖల అధికారులు సమావేశానికి హాజరుకానున్నట్లు చెప్పారు.
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థలం లేకపోవడంతో సమావేశాన్ని రైతువేదికకు మార్చినట్లు పేర్కొన్నారు. గ్రామ పాలనతో పాటు వివిధ అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

