వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం మడపాం జడ్పీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంఈఓ ఉప్పాడ శాంతరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హెచ్ఎం భారతితో కలిసి వంట తయారీని పరిశీలించారు. వంట ఏజెన్సీ సభ్యులకు పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందించాలని స్పష్టం చేశారు. ఎటువంటి లోటుపాట్లు ఉన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

