Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి: జేసీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 6:26 PM గుంటూరుGeneral
మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి: జేసీ - Udayam
జిల్లాలో 'ప్రధానమంత్రి పోషణ్' పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ (జేసీ) అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి స్టీరింగ్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నిత్యం నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన భోజనం మాత్రమే అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...