వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని 44వ జాతీయ రహదారిపై గుట్టూరు కూడలి వద్ద ఆదివారం దారుణ ప్రమాదం జరిగింది. అమ్మవారిపల్లి గ్రామానికి చెందిన అంజి (37) అనే వ్యక్తి కాలినడకన రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

