వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్డీవో ఇంట్లో భారీ చోరీ

కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్డీవో పి.కృష్ణమూర్తి నివాసంలో చోరీ కలకలం రేపింది. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, డీఎస్పీ తిలక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...