వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల ఏసిపి ప్రకాష్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం మద్యం విక్రయ దారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన వయస్సు ఉన్న వారికి మాత్రమే మద్యాన్ని విక్రయించాలని సూచించారు. అలాగే మద్యం దుకాణాల విషయంలో సమయ వేళలు పాటించాలన్నారు.
ప్రతి మద్యం దుకాణం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

