వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలోని బారామతిలో ఎమ్మెల్యే రోహిత్ పవార్ పీఏ కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం తల్లితో స్వల్ప వాగ్వాదం తర్వాత ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం ఉదయం సైనగర్లోని నివాసం సమీపంలో మృతదేహం లభ్యమైంది. మేడ తలుపు లోపల నుంచి లాక్ అయి ఉండటంతో ఆమెపై నుంచి దూకి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

