Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది రైతుల భూ సమస్యలకు పరిష్కారం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:51 PM నంద్యాలGeneral
మహానంది రైతుల భూ సమస్యలకు పరిష్కారం - Udayam
మహానంది మండలానికి చెందిన 88 మంది రైతుల 197 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించినట్లు కలెక్టర్‌ రాజకుమారి సోమవారం తెలిపారు. కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ హాలులో రైతులకు ప్రొసీడింగ్స్‌ కాపీలను పంపిణీ చేశారు. రైతులు, భూ యజమానుల సమస్యలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తామని, డాటెడ్‌ ల్యాండ్స్‌ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...