వార్తలకు తిరిగి వెళ్లండి

కొచ్చిన్ షిప్యార్డు లిమిటెడ్ భారత నౌకాదళం కోసం నిర్మించిన జలాంతర్గామి విధ్వంసక నౌక 'మచిలీపట్నం’ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఎనిమిది నౌకల సిరీస్లో ఇది ఏడోది.
సముద్ర గర్భంలో నిఘా, జలాంతర్గాముల విధ్వంసం, తీర ప్రాంత సముద్రయాన కార్యకలాపాలకు ఈ నౌక ఉపయోగపడుతుందని రక్షణ శాఖ తెలిపింది. వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్ సమక్షంలో కార్యక్రమం జరిగింది.
Comments
Loading comments...
