వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవన్ శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయంలో శివార్చన ఘనంగా జరిగింది. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ పురోహితులు సాంబారి శాస్త్రి ఆధ్వర్యంలో మహాలింగానికి పంచామృతాభిషేకం, మహార్చనతో పాటు ప్రత్యేక శ్రావణ పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి, భక్తులు శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

