Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవపాడులో పసుపు అట్టలతో కీటకాలకు చెక్!

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:43 AM జోగులాంబ గద్వాల్ General
మానవపాడులో పసుపు అట్టలతో కీటకాలకు చెక్! - Udayam
సాగులో రసాయనిక పురుగు మందుల వినియోగాన్ని సమగ్ర సస్యరక్షణతో తగ్గించవచ్చని మానవపాడు మండల వ్యవసాయ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. టమాట, మిరప పంటల్లో రసం పీల్చే పురుగుల నివారణకు పసుపు రంగు అట్టలు ఉపయోగపడతాయన్నారు. ఎకరానికి 20-30 అట్టలను జిగురు రాసి కట్టెలకు అమర్చడం ద్వారా క్రిమికీటకాలు వాటికి అంటుకుని చనిపోతాయని తెలిపారు. దీంతో తెగుళ్లను అరికట్టవచ్చన్నారు.

Comments

G
Loading comments...