Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానస ప్రతిభకు అరుదైన గౌరవం.. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 04, 2026 3:05 PM సంగారెడ్డిGeneral
మానస ప్రతిభకు అరుదైన గౌరవం.. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక - Udayam
గంగారం తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మానస నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ బోధనాభ్యసన సామగ్రి (టీఎల్‌ఎం) ప్రదర్శనలో విశేష ప్రతిభ కనబరిచినందుకు ఆమెకు ఈ గుర్తింపు లభించింది. సంగారెడ్డి జిల్లాలో టీఎల్‌ఎం ప్రదర్శనలో మానస ప్రతిభను పలువురు అభినందించారు. ఆమె ఎంపికపై మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...