వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞాన జ్యోతి కార్యక్రమం ద్వారా అంగన్వాడీ టీచర్లకు డిజిటల్ బోధన విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామని పిడుగురాళ్ల ఐసీడీఎస్ సీడీపీఓ రాజేశ్వరి అన్నారు.
మంగళవారం మాచవరం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జ్ఞాన జ్యోతి ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. దీక్ష యాప్, డిజిటల్ ప్లాట్ఫామ్ వల్ల ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కోటేశ్వరి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Loading comments...

