వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: లష్కర్ల సమస్యలను ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు.
సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

