వార్తలకు తిరిగి వెళ్లండి

చోడవరంలో ప్రేమించిన యువతితో వివాదం కారణంగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారకానగర్కు చెందిన లక్కరాజు ప్రశాంత్ (23) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బీటెక్ పూర్తి చేసి గేట్ పరీక్షకు సిద్ధమవుతున్న ప్రశాంత్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
