Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం వాటా విక్రయ ప్రకటనతో ఎల్‌ఐసీ షేర్ల పతనం

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Aug 04, 2026 12:50 PM ఆల్ ఇండియా జాతీయ
కేంద్రం వాటా విక్రయ ప్రకటనతో ఎల్‌ఐసీ షేర్ల పతనం - Udayam Digital
ఎల్‌ఐసీలో 6.5 శాతం వరకు వాటాను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయించాలని కేంద్రం నిర్ణయించడంతో మంగళవారం సంస్థ షేర్లు క్షీణించాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఎల్‌ఐసీ షేరు దాదాపు 8 శాతం వరకు పడిపోయింది. ఓఎఫ్‌ఎస్‌లో ఒక్కో షేరు కనీస ధరను రూ.382గా నిర్ణయించారు. విక్రయం ద్వారా కేంద్రానికి సుమారు రూ.31 వేల కోట్లు సమకూరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అనంతరం ప్రభుత్వ వాటా 90 శాతానికి తగ్గనుంది.

Comments

G
Loading comments...