వార్తలకు తిరిగి వెళ్లండి
కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై మార్గదర్శకాలు కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ, ఎన్డీఎస్ఏలకు లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
కేంద్ర సంస్థల సిఫారసుల ఆధారంగానే తదుపరి నిర్ణయాలు ఉంటాయని సమీక్షలో స్పష్టం చేశారు. బ్యారేజీల్లో నీటి నిల్వ, పంపింగ్పై సాంకేతిక ఆధారాలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపాలని సూచించారు.
Comments
Loading comments...