వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కిలో రూ.30లోపు ఉన్న ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం మార్కెట్ వేలంలో మహారాష్ట్ర ఉల్లి క్వింటా రూ.4,800, సాధారణ ఉల్లి రూ.4,500 పలికాయి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తారు.
స్థానిక పంట రాకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నామని మార్కెట్ దళారులు తెలిపారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

