Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో 65.. నంద్యాలలో 21 పోస్టులు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:26 AM కర్నూలుGeneral
కర్నూలులో 65.. నంద్యాలలో 21 పోస్టులు - Udayam
కర్నూలులో 65, నంద్యాల జిల్లాలో 21 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 పోస్టులను జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన 25–45 ఏళ్ల మహిళలకు, పదో తరగతి అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన ఆశా కార్యకర్తకు నెలకు రూ.10 వేల వేతనం లభిస్తుంది.

Comments

G
Loading comments...