వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణ్ జ్యోతి నగర్కు చెందిన టీడీపీ నాయకుడు నాగరాజు కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన నాగరాజు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆసుపత్రికి వెళ్లి నాగరాజును పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాగరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

