Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రోసూరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంఅండ్‌హెచ్‌వో

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 5:37 PM పల్నాడుGeneral
క్రోసూరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంఅండ్‌హెచ్‌వో - Udayam
క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) రత్న మన్మోహన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా హైరిస్క్ గర్భాలను ముందే గుర్తించి తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...