వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా, భీమా నదుల్లో భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ కర్ణాటక నుంచి వస్తున్న నీటితో తంగిడిగి వద్ద సంగమం తర్వాత తెలంగాణలోకి మంగళవారం సాయంత్రానికి 3 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహం నమోదైంది.
నారాయణపేట జిల్లా కృష్ణా పుష్కరఘాట్ సగానికిపైగా నీటమునిగింది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు, పశువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

