వార్తలకు తిరిగి వెళ్లండి

కరువు పరిస్థితుల్లో వ్యవసాయానికి కరెంట్ కోతలు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మణ నాయుడు అన్నారు.
రోజుకు 4-5 గంటలు, అదీ విడతలుగా విద్యుత్ ఇవ్వడంతో పంటలకు సకాలంలో నీరు అందడం లేదన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పగటి పూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

