వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో తాడేపల్లిగూడెం–రాజమండ్రి మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రశాంతి, రత్నాచల్ ఎక్స్ప్రెస్లతో పాటు పలు ప్రత్యేక రైళ్లపై ప్రభావం పడింది.
తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ట్రాక్ పునరుద్ధరణకు రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

