Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొరమీను చేపల సాగుతో అదనపు ఆదాయం

Follow Udayam on Google
K Anuradha Aug 19, 2026 11:00 AM శ్రీకాకుళంGeneral
కొరమీను చేపల సాగుతో అదనపు ఆదాయం - Udayam
ఆసక్తి ఉన్న మహిళా సంఘాల సభ్యులు, ఔత్సాహికులు కొరమీను చేపల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని సోంపేట మూలపొలం ఉదయ్ ఆక్వా ప్రతినిధి మనోహర్ తెలిపారు.మందస వెలుగు కార్యాలయంలో ఏపీఎం పైడి కూర్మారావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన శిక్షణ, సమీక్షలో అవగాహన కల్పించారు. బోరు, విద్యుత్ సౌకర్యం ఉన్న రైతులు ట్యాంకులు ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపడితే అదనపు, స్థిర ఆదాయం పొందవచ్చన్నారు.

Comments

G
Loading comments...