వార్తలకు తిరిగి వెళ్లండి

మందసలో రెండు నెలలుగా కోతుల బెడద తీవ్రంగా ఉందని జనసేన నాయకులు తెలిపారు. ఇళ్లలోకి చొరబడి ఆహారం, వస్తువులు ఎత్తుకెళ్తున్నాయని, దాడుల్లో సుమారు 50 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.
కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈఓ బమ్మిడి నవీన్కుమార్కు వినతిపత్రం అందజేశారు. దున్న హరికృష్ణ, వంకల రమేష్, సుగ్గు జోగ పాల్గొన్నారు.
Comments
Loading comments...

