వార్తలకు తిరిగి వెళ్లండి

దారూర్ మండలంలోని కోట్పల్లి ప్రాజెక్ట్ వద్ద పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. వరుస సెలవులు రావడంతో పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివచ్చి బోటింగ్ చేస్తూ ఆనందించారు.
చుట్టూ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో యువతీయువకులు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. ప్రాజెక్ట్ ను సందర్శించే పర్యాటకులు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

