వార్తలకు తిరిగి వెళ్లండి

కోకట్ గ్రామ పరిధిలోని స్టోన్ పాలిష్ మిషన్ యూనిట్లో ఇద్దరు వ్యక్తులు (అబ్దుల్ లయాఖత్, గోరెప్ప) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం రాత్రి మద్యం సేవించి నిద్రించిన వీరు మంగళవారం ఉదయానికి శవాలై కనిపించారు.
శరీరాలపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు లేకపోవడంతో మృతదేహాలను పోస్టుమార్టానికి తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి యాలాల పోలీసులు, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

