వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలస మండలం ముసిరాం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ వెనుక కోడిపందాలు ఆడుతున్న వారిపై పోలీసులు శనివారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.9,640, నాలుగు సెల్ఫోన్లు, రెండు కోడి పుంజులు, రెండు కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు పణంగా పెట్టి కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

