వార్తలకు తిరిగి వెళ్లండి
పాచిపెంట మండలం పి.కొనవలస చెక్పోస్ట్ నుంచి ఒడిశా ఘాట్ రోడ్డులో కొండలకు మేఘాలు అల్లుకున్నాయి. శుక్రవారం ఉదయం చిరుజల్లులు కురియడంతో ఘాట్ రోడ్డు అంతా మేఘాలతో నిండిపోయింది.
వర్షం తగ్గుముఖం పట్టాక తెల్లటి మేఘాలు కొండను చుట్టుముట్టడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రకృతి అందాలను పలువురు తమ సెల్ఫోన్లలో బంధించారు.
Comments
Loading comments...

