వార్తలకు తిరిగి వెళ్లండి
కొండగట్టు అంజన్న ఆలయంలో విధుల్లో చేరిన ఇద్దరు కొత్త మంగళ వాయిద్య కళాకారులు

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో కొత్తగా నియమితులైన మంగళ వాయిద్య కళాకారులు మంగలి సుదర్శన్ బాబు, తిరుమల వెంకట అశోక్ నేడు విధుల్లో చేరారు. ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలతో స్వామివారి నిత్యకైంకర్యాలు, ఉత్సవాల్లో నాదస్వర శోభ పెరగనుంది. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంపై ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ ఆలయ సేవలు మెరుగుపడతాయని తెలిపారు.
Comments
Loading comments...