వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలంలోని కొండచొర్లంగి గ్రామంలో పాతబడిన ఇళ్లు అధ్వానంగా మారడంతో గిరిజన కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మట్టి గోడలు, రేకుల పైకప్పుతో ఉన్న ఇల్లు ఎప్పుడు కూలిపోతుందోనని ఆందోళన నెలకొంది.
వర్షాకాలంలో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. అర్హులైన పేద గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

